ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కౌటాల మండల కేంద్రానికి చెందిన ముద్రకోల సురేష్ జ్ఞాపకార్థం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో నేడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
స్థానిక మండల యువకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ప్రారంభించారు. రక్తదానం చేసిన యువకులను ఎమ్మెల్యే అభినందించారు.
కౌటాలలో ముద్రకోల సురేష్ జ్ఞాపకార్థం స్థానిక మండల యువకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం మంచి సాంప్రదాయమని సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప అన్నారు.
రక్తదానం చేయడం అంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమేనని ఆయన అన్నారు.