కడప జిల్లా రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రధాని మోడీ జన్మదిన సందర్భంగా శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రాజంపేట అసెంబ్లీ కన్వినర్ పోతుగుంట రమేష్ నాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా గత వారం రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ కరోనా విపత్కర సమయంలో కూడా రక్తదానాన్ని చేసేందుకు ముందుకు వచ్చిన వారికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ఏ గుణవర్మ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వి సురేష్ రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పి. ఆదినారాయణ,బిజెపి పట్టణ అధ్యక్షుడు ఎం వెంకట సుబ్బయ్య నాయుడు, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ అనిల్, మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ రేణు ప్రసాద్,
యం. వేణుగోపాల్నాయుడు బిజెపి మండల అధ్యక్షురాలు బి ప్రభావతి, మాజీ మండల అధ్యక్షుడు పీ పాపయ్య, నర్సింహ రాజు రాము శ్రీనివాస్ రాజు సుభద్ర ,కళావతి,
రవిశంకర్ వేణుగోపాల్ రాజు బిజెపి జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, బిజెపి పుల్లంపేట మండల అ్యక్షుడు సుబ్బయ్య ,శంకర్ రాజు పాల్గొన్నారు. క్రాస్ సొసైటీ కడప వారి సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు.