27.7 C
Hyderabad
April 26, 2024 04: 20 AM
Slider రంగారెడ్డి

సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా 9న రక్తదానం

#uppal

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈనెల తొమ్మిదవ తేదీన బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో నిర్వహించ తలపెట్టిన రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని టిపిసిసి కార్యదర్శి, కాంగ్రెస్ ఉప్పల్ బి బ్లాక్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం కుషాయిగూడలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యుఐ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఏఐసిసి అధ్యక్షుడు, ఎంపి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

విద్యార్థులకు పిఎస్ఆర్ ట్రస్టు తరుపున ఆర్థిక సాయం

Bhavani

చంద్రబాబు పీఏ సహా 45 మందిపై కేసు

Satyam NEWS

గుండెపోటుతో టిఆర్ఎస్ నాయకుడు నాగేశ్వరరావు మృతి

Satyam NEWS

Leave a Comment