సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 307వ,వ్యక్తి రక్త దానం చేశారు. హుజూర్ నగర్ పట్టణంలోని ప్రయివేట్ వైద్యశాలలో శనివారం మహిళకు గర్భసంచి ఆపరేషన్ కు ‘ఏ’ పాజిటివ్ రక్తం అత్యవసరంగా కావాలని జనచైతన్య ట్రస్ట్ ను సప్రదించగా ట్రస్ట్ నిర్వాహకులు వంశీ, పార సాయి,పిల్లి.శివశంకర్ లు తక్షణమే స్పందించి డోనార్స్ తో మాట్లాడి తక్షణమే ట్రస్ట్ అధ్యక్షుడు పార సాయి చేజర్ల అంజి తో మాట్లాడి హాస్పిటల్ వద్దకు పంపి ‘ఏ’ పాజిటివ్ బ్లడ్ రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ తరుపున వ్యక్తికి రక్తదానం చేసిన చేజర్ల అంజి ని ట్రస్ట్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ రక్తం చెట్లకు కాసేది కాదని, భావిలో ఊరేది కాదని,కర్మాగారాలలో తయారు చేసేది కాదని,మెడికల్ షాప్ లో దొరికేది కాదని,మనిషిలో మాత్రమే ఉండేది,మనిషి మాత్రమే ఇవ్వగలిగేది రక్త మని అన్నారు.ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి చేతనైనా సాయం చేద్దామని, అందుకు అందరూ సాయపడాలని కోరారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్