38.2 C
Hyderabad
April 25, 2024 11: 28 AM
Slider శ్రీకాకుళం

వరుణ్ తేజ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులు

#MegaFans

మెగా కుటుంబ వారసుడు మెగా బ్రదర్ నాగబాబు  తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ  పుట్టిన రోజు వేడుకులు మంగళవారం  ఘనంగా జరిగాయి. అందులో భాగంగా జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో వరుణ్ తేజ్ పేరుతో ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలాగే శ్రీకాకుళంలోని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో వరుణ్ తేజ్ అభిమానులు రక్తదానం చేసారు.   అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  తైక్వాండో శ్రీను నేతృత్వంలో జిల్లా వరుణ్ తేజ యువత ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను శ్రీకాకుళం నగరంలో నిర్వహించారు.    

నగరంలోని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని  రెడ్‌క్రాస్‌ రాష్ట్ర వైస్ చైర్మన్‌ జగన్మోహన్‌రావు, రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను తదితరులు ప్రారంభించారు.  వరుణ్ తేజ అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ అభిమానులు  ఈ శిబిరంలో పాల్గోని రక్తదానం చేసారు.  

ఈ సందర్భంగా రాష్ట్ర రెడ్‌క్రాస్‌ వైస్ చైర్మన్‌ జగన్మోహన్‌రావు మాట్లాడుతూ మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ అభిమానులు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని, వారి సేవా కార్యక్రమాలతో ఎందరికో మంచి జరుగుతుందని అన్నారు.

గడిచిన ఎన్నేళ్లుగానో మెగాస్టార్‌ అభిమానులు క్రమం తప్పకుండా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదానం చేస్తూ  ఎందరికో ప్రాణదాతలు అవుతున్నారన్నారు.  

రక్తం కొరతగా ఉండడం వల్ల ఆపదలో ఉన్న వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  

రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి అభిమాను సంఘం జిల్లా అధ్యక్షుడు తైక్వాండో శ్రీను మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా మెగాస్టార్‌ చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తితో విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు.

సామాజిక బాధ్యతగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ జన్మదినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరంతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సేవారంగంలో మెగాఫ్యామిలీ అభిమానులు పేరును చిరస్థాయిగా దేశంలో నిలిపిన ఘనత ప్రతి ఒక్క అభిమానికి దక్కుతుందని అన్నారు.  

ఈ కార్యక్రమంలో  ఉత్తరాంధ్ర  చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు మోహన్ ,రామ్ చరణ్ యువత అధ్యక్షుడు తైక్వాండో గౌతం , నాని చరణ్ నిజం , హరీష్ ,  .పెయ్యల చంటి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అద్యక్షుడు పుక్కల నవీన్ ,తాలాడ  శేఖర్, హేమ ,

వరుణ్ తేజ అభిమాన సంఘ అధ్యక్షుడు కొర్ల య్య ,సీర  రాజు ,సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ , కిరణ్ , మౌళి లతో పాటు మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు .

Related posts

న్యూ ఛేంజ్: చెత్తకు మారుపేరైన మునిసిపాలిటీలు మారాలి

Satyam NEWS

రాజంపేటలో వికేంద్రీకరణకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ

Satyam NEWS

బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో షుక్రియా మోడీజీ

Satyam NEWS

Leave a Comment