19మందితో వెళుతున్న పడవ మునిగిన ఘటనలో 11 మంది వలసదారులుమృతి చెందారు. చనిపోయిన వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు.టర్కీ కోస్ట్ గార్డ్ అధికారుల సమాచారం ప్రకారం పశ్చిమ టర్కీలోని ఈజియన్ ప్రావిన్స్ ఇజ్మీర్ తీరంలో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు జాతీయత మరియు వారి వివారాలు తెలియదాని అధికారులు పేర్కొన్నారు.
previous post