తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. చింతూరు లోని శబరి నది బ్రిడ్జిని ఢీకొని లాంచీ మునిగి పోయింది. లాంచీలో వరద ముంపు బాధితులు ఉన్నట్లు సమాచారం.
చీకటి కావటంతో ఎంత మంది లాంచీలో ఉన్నారో తెలియని పరిస్థితి ఉంది. ఘటనా ప్రాంతానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు చేరుకుంటున్నారు.