28.2 C
Hyderabad
December 1, 2023 19: 31 PM
Slider తెలంగాణ

బొగత జలపాతం వద్దకు రావద్దు ప్లీజ్

bogatha waterfalls

తెలంగాణ రాష్ట్రంలోని బొగత జలపాతం ఉగ్రరూపంతో ఉవ్వెత్తున ఎగసి పడుతూ ఉరకలెత్తుతోంది. ములుగు జిల్లా వాజీడు మండలం కోయవీరపురం సమీపంలో ఉన్న ఈ జలపాతం రాష్ట్రంలోని అతిపెద్ద రెండో జలపాతంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రకృతి సౌందర్యానికి పేరొందిన ఈ ప్రాంతానికి నిత్యం వందలాది మంది సందర్శకులు తరలివస్తుంటారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం చీకుపల్లి ప్రవాహంలో నీటి ఉద్ధృతి అధికంగా ఉండడంతో బొగత జలపాతం ప్రమాదకరంగా ఎగసిపడుతోందని, అందువల్ల సందర్శకులు రావద్దని అటవీ శాఖ కోరింది.

Related posts

పోలీసులూ ఖాకీ వదిలి గులాబి డ్రెస్ వేసుకోండి

Satyam NEWS

భయం గుప్పిటిలో చిక్కుకున్న విశాఖ మన్యం

Satyam NEWS

సమయ పాలన పాటించాలి, పని చేసే చోటే నివాసం ఉండాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!