Slider సినిమా

బాలీవుడ్ హీరోయిన్ ప్రేక్ష మెహతా ఆత్మహత్య

#Preksha Mehatha

లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధిని కోల్పోవడంతో డిప్రెషన్ కు లోనై బాలీవుడ్ నటి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని తన నివాసంలో ఆమె నిన్న రాత్రి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఈ రోజు ఉదయం ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు.

చనిపోవడానికి ముందు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టింది. కన్న కలలు చనిపోయినప్పుడు… జీవితం చెత్తగా ఉంటుందని అని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత ఉరి వేసుకుంది. ఈ ఉదయం ఫ్యాన్ కు వేలాడుతున్న ప్రేక్షను చూసి ఆమె తండ్రి షాక్ కు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గ వంటి పలు టీవీ షోలతో పాటు… అక్షయ్ కుమార్ చిత్రం ‘ప్యాడ్ మేన్’లో కూడా ఆమె నటించింది. ఆమె మృతి పట్లు పలువరు నటీనటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Related posts

క్లీన్, స్మార్ట్ అండ్ సేఫ్ కొల్లూరు డబుల్ బెడ్ రూమ్స్

Satyam NEWS

అంతర్వేది రధం తగలబెట్టిన వారిని కఠినంగా శిక్షిస్తాం

Satyam NEWS

కరోనా బాధితులకు పండ్లు కూరగాయల పంపిణీ

Satyam NEWS

Leave a Comment