అలనాటి అందాల తార రేఖ సెక్యూరిటీ గార్డుకు కరోనా సోకింది. బృహన్ ముంబయి మునిసిపల్ కార్పొరేషన్ వైద్యులు రేఖ కార్యాలయంలోని సిబ్బంది అందరికి కరోనా టెస్టులు నిర్వహించగా రేఖ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన స్టాఫ్ అందరిని క్వారంటైన్ కు తరలించారు.
ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ పక్క బంగ్లాలోనే ఉన్నందున ఆయన స్టాఫ్ కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. రేఖను కూడా కరోనా టెస్టు చేయించుకోవాల్సిందిగా వైద్య సిబ్బంది కోరినా ఆమె అందుకు నిరాకరించారు.