27.7 C
Hyderabad
April 18, 2024 07: 56 AM
Slider గుంటూరు

బొందిలి కులస్తులను ఓబీసీలలో చేర్చడానికి కృషి చేస్తాం

#narasaraopetmla

బొందిలి కులస్తులను ఓబీసీలలో చేర్చడానికి తన వంతు కృషి చేస్తానని గుంటూరు జిల్లా నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. నూతనంగా ఏర్పాటైన బొందిలి సంఘం వారి పాలకవర్గం అభినందన సభ నేడు నరసరావుపేట పట్టణంలోని విజయ్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొందిలి సామాజిక వర్గాన్నీ బీసీ- బీ లో చేర్చి బొందిలిలకు న్యాయ చేసిన ఘనత వైఎస్ఆర్ దేనని గుర్తుచేశారు. ఓబీసీ రిజర్వేషన్లకు వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి స్పష్టం చేశారు.

ఓబీసీ లోకి బొందిలి లను చేర్చడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కోటప్పకొండ వద్ద సత్రం ఏర్పాటుకు స్థలం కేటాయించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. బొందిలి కులస్తుల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందించడానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.

అనంతరం బొందిలిల జీవిత స్థితిగతులపై రూపొందించిన డాక్యుమెంటరి సిడి ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొందిలి కార్పొరేషన్ చైర్మన్ కిషోర్ సింగ్, ఏపీ బొందిలి సంఘం గౌరవ అధ్యక్షులు శంకర్ సింగ్, అధ్యక్షులు నెల్లూరు కృష్ణ సింగ్, పాలక వర్గ సభ్యులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, జిల్లా అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్, మూరే రవీంద్రా రెడ్డి, కనక పుల్లారెడ్డి, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

రేపటి నుంచి తెలంగాణలో లాక్ డౌన్ పాక్షిక సడలింపు

Satyam NEWS

డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే ప్రయత్నం

Satyam NEWS

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యం

Satyam NEWS

Leave a Comment