చర్లపల్లి డివిజన్ కృష్ణా రెడ్డి నగర్ కాలనీ లో చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ బుధవారం జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యటించారు. ఈ మేరకు కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కాలనీలో నూతన స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు.కొన్ని రోజుల క్రితం అమర్చిన లైట్లు కొన్ని పని చేయడం లేదు కాబట్టి వాటికి మరమ్మతులు చేసి, లేని చోట నూతన లైట్లు అమర్చాలని అధికారులకు కార్పొరేటర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ లు స్వరూప,రోహిత్,కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్ నాయక్,సభ్యులు నాగరాజ్,విజయ్,సురేష్,శ్రీను, రాజేంద్ర,సురేష్,మధు,చంద్రశేఖర్, శ్రీరాములు,వెంకటేష్,వినోద్, ప్రశాంత్, శేఖర్, శంకర్, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా