‘జగన్ జైత్రయాత్ర లో విశేషాలు..’ అన్న పుస్తకాన్ని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన నివాసంలో ఆవిష్కరించారు.
విజయనగర వాస్తవ్యుడు గురుప్రసాద్ రాసిన పుస్తకాన్ని ఎమ్మెల్యే స్వామి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ… పీ హెచ్ డి చేసిన గురుప్రసాద్… జగన్ చేసిన పాదయాత్ర, ఆ తర్వాత రాష్ట్ర సీఎం గా ఇచ్చిన హామీలను నవరత్నాల పేరుతో ఒక్కొక్కటిగా అమలు పరిచే విధానాన్ని..పుస్తక రూపంలో పొందుపరచడం పట్ల ఆయనకు ఉన్న ఇష్టం అర్ధమవుతోందన్నారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ కౌన్సలర్ వడ్లమాని సుభద్ర పాల్గొన్నారు.