నేస్తం ఫౌండేషన్ మరియు కల్వకుంట్ల ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని సఫాయి వాడ అంగన్వాడి సెంటర్ లో పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు, పలకలు, పెన్సి ల్స్ పంపిణీ చేయడం జరిగింది.
పాఠశాలలు ప్రారంభమైన నేపద్యంలో పిల్లలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ ములుగు పట్టణ అధ్యక్షులు మేర్గు సంతోష్ యాదవ్ హాజరైనారు.
ఈ కార్యక్రమంలో నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు నక్క రాజు, కల్వకుంట్ల ఫౌండేషన్ ఉపాధ్యక్షులు జన్ను భరత్, మొహమ్మద్ రషీద్, మర్రి మధు, రత్నం రాజు, నక్క స్వర్ణలత, టీఆర్ఎస్ ములుగు పట్టణ అధ్యక్షులు మేర్గు సంతోష్ యాదవ్, అంగన్వాడి సెంటర్ టీచర్ జయశ్రీ, కాలనీ వాసులు పాల్గొన్నారు.