సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సుమారు 60 వేల రూపాయలు విలువ కలిగిన నోటు పుస్తకాలను, మాస్కులను ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త తండు సైదారత్నం శుక్రవారం విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా సైదా రత్నం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆన్ లైన్ పాఠాలను శ్రద్ధగా విని మంచి మార్కులు సాధించాలని అన్నారు. విద్య పేదరికానికి అడ్డుకాదని, ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని, నేటి బాలలే రేపటి పౌరులని, విద్వాంసులు ఎక్కడైనా గౌరవింపబడతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మల్లెల ఉదయశ్రీ, శ్రీనివాస రెడ్డి, ప్రసన్న, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, ఉపేందర్, శేషగిరి, సుజాత, దినారాణి, అశ్విని, జనార్దన్ రెడ్డి, వసంతరావు, రవీందర్ రెడ్డి,కవిత విద్యార్థులు పాల్గొన్నారు.