31.2 C
Hyderabad
April 19, 2024 05: 59 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ శాఖ గ్రంథాలయానికి గ్రంధాలు బహుకరణ

#hujurnagar

మాజీ శాసనసభ్యుడు ఆరిబండి లక్ష్మీనారాయణ పేరుమీద స్థాపించిన ‘అరిబండి ఫౌండేషన్’ఆధ్వర్యంలో సోమవారం హుజూర్ నగర్ శాఖ గ్రంథాలయానికి అరిబండి లక్ష్మీనారాయణ మనవడు,పెంచికలదిన్నె మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ 8వేల రూపాయల విలువ గలిగిన కాంపిటీటివ్ ఎగ్జామ్ కు అవసరమైన పుస్తకాలను గ్రంథాలయ కార్యదర్శి సమక్షంలో గ్రంథాలయానికి బహుకరించారు.

ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ చదువుతో ఏలక్ష్యాన్నైనా సాధించవచ్చునని నమ్మే అరిబండి సిద్ధాంతానికి అనుగుణంగా పేద,మధ్య తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా 15 గ్రంథాలయాలకు పుస్తకాలను బహుకరించినట్లు తెలిపారు.యువత రాబోవు పరీక్షలకు గ్రంధాలయాలు వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నందిగామ రత్నకుమార్,శీలం శ్రీనివాస్,శ్రీ రాముల ఆంజనేయులు,పాఠకులు, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఆర్జితసేవలు రద్దు

Satyam NEWS

అనాథలకు ఉప్పల ట్రస్ట్ వారి పక్కా ఇల్లు

Satyam NEWS

సీనియర్ కార్యకర్త పాడె మోసిన జూపల్లి కృష్ణారావు

Satyam NEWS

Leave a Comment