భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ బిజేపి లో చేరారు. ఇటీవల టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కాగా మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న నేపధ్యంలో బూర నర్సయ్య బిజేపి లో చేరటం, ఆయన సామాజిక వర్గానికి చెందిన వోటర్లు అక్కడ అధికంగా వుండటం బిజేపి కి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు.