భువనగిరి మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ కలిశారు. ఇటీవల టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన ఈ నెల 19 నా అమితాషా ఆధ్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకొనున్నారు. బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ వుద్యమం నుండి కేసిఆర్ తోనే వున్నారు. గత ఎన్నికలలో ఆయన భువనగిరి ఎంపి గా పోటీ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమి చెందారు. తర్వాత టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. పార్టీ కూడా ఆయనను దూరంగా వుంచిందనే ఆరోపణలు వున్నాయి. ఈ నేపధ్యంలో ఆయన బిజేపి లో చేరానున్నారు. ఆయన ప్రభావం మునుగోడు ఉప ఎన్నికలపై పడే అవకాశం వున్నది.