28.7 C
Hyderabad
April 25, 2024 06: 48 AM
Slider ముఖ్యంశాలు

అత్యాచారం జరగలేదు: మత్తులో ఊగింది… ఫ్రెండ్స్ తో గడిపింది…

#GangRape

హైదరాబాద్ శివార్లలో బీఫార్మసీ విద్యార్థిని పై అత్యాచారం జరిగింది….. నలుగురు ఆటో డ్రైవర్లు ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశారు….

అమ్మో హైదరాబాద్ లో ఇంతటి ఘోరాలు జరుగుతున్నాయా? అంటూ ఆశ్చర్యపోవద్దు.. ఆందోళన చెందవద్దు. ఇదంతా అబద్ధమే….

వాస్తవానికి అసలు ఏం జరిగిందంటే…

ఆ యువతి ఇసిఐఎల్ చౌరాస్తాలో ఆటో ఎక్కి రాంపల్లి వరకు వెళ్లింది. అక్కడ నుంచి తన ప్రియుడిని పిలుచుకుని ద్విచక్ర వాహనంపై వెళ్లింది.

ఆ తర్వాత అతని ఇద్దరు సోదరులతో కలిసి గంజాయి సేవించింది. ఆమె అనుమతితోనే వారంతా ఆ అమ్మాయితో ఒక్కొక్కరూ ఏకాంతంగా గడిపారు.

ఇది తెలియని ఆ అమ్మాయి తల్లి తరచూ ఫోన్ చేస్తుండటంతో ఆ అమ్మాయికి ఏం చెప్పాలో తెలియక ఆటో డ్రైవర్లు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని చెప్పింది.

దీంతో భయపడిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఆ ప్రాంతంలో సైరన్లు వినిపించడంతో.. భయపడిన ఆ యువకులు ఆమెను రహదారి పక్కన వదిలేసి వెళ్లిపోయారు.

దీంతో గస్తీ కాస్తున్న పోలీసులకు యువతి తారసపడింది. మత్తులో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.

అనంతరం యువతిని ప్రశ్నించగా.. ఆటోడ్రైవర్లు అత్యాచారం చేశారని తెలిపింది.

ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలించగా యువతి ద్విచక్రవాహనంపై వెళ్తున్నట్లు కనిపించింది.

దీంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. స్నేహితులతో కలిసి యానంపేట పరిసరాల్లోకి వెళ్లానని యువతి ఒప్పుకొన్నట్లు  సమాచారం.

Related posts

అమ్మ ఆశీస్సులు

Satyam NEWS

జగిత్యాల జిల్లాలో పోలీసులకు యోగా శిక్షణ

Satyam NEWS

మణిపూర్‌లో మంటలు ఆర్పండి

Bhavani

Leave a Comment