జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారము మండల బ్రాహ్మణ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా ధీరేంద్ర దాసు,ప్రహ్లాద రావు,మండల అధ్యక్షుడిగా బాబురావు, ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా అరవింద్ రావు,కార్యదర్శిగా చంద్రశేఖర రావు,కోశాధికారిగా శ్రావణ్ కుమార్,కన్వీనర్ గా నాగరాజు శర్మ, జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రచారకర్త వెంకోబ్రావ్, మీడియా ఇన్ఛార్జి ముకుందరావు, కార్యవర్గ సభ్యులు చక్రధర్, పురోహితులు మధుసూదనాచార్యులు,రవి ఆచార్యులు,రమేషాచార్యులు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బ్రాహ్మణులు అంతా ఐకమత్యంతో కలిసి ఉండాలని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏకతాటిపై వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. బ్రాహ్మణులపై ఏదైనా సంఘటన జరిగితే వెంటనే స్పందించి వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
previous post