విజయనగరంలో బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర నేతలు సమావేశం అయ్యారు. నగరంలోని శంకరమఠం రోడ్డులో ఉన్న బ్రాహ్మణ సమాఖ్య గాయత్రీ భవనంలో నేతలు బ్రాహ్మణ పండితులు, పెద్దలు హాజరై..భవిష్యత్ కార్యచరణ కై చర్చించారు.
మొన్నామద్య నే బ్రాహ్మణ కోపరేటివ్ సోసైటీ ద్వారా పేద బ్రాహ్మణులకు నెలవారి ఫించన్ అందించాలని బ్రాహ్మణ సమాఖ్య నిర్ణయించింది కూడ.
అందుకోసం..ఓ నిధిని ఏర్పాటు చేయాలని సమాఖ్య అనుకుంది.ఈ నేపధ్యంలోవిజయనగరంలో బ్రాహ్మణ సమాఖ్య నేతలంతా కార్యదర్శి రాకేష్ శర్మ నేతృత్వంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రవి, భరణి, సత్య ప్రసాద్,ఎల్లాజోస్యుల రవికుమార్..చక్రవర్తి…తదితర నేతలంతా హాజరయ్యారు. బ్రాహ్మణులందరూ తప్పని సరిగా ఆధార్ కార్డు ఎన్ రోల్ చేయించుకోవాలని సమాఖ్య తీర్మానించింది.