సంక్రాంతి సందర్భంగా ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం క్రికెట్ పోటీలను నిర్వహించదలచింది.
ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రాకేష్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 10 నుంచీ మూడు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్ర బ్రాహ్మణ క్రీడా సంఘం ఆధ్వర్యంలో 13 జిల్లాలలో కూడ బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ జరుగుతోందన్నారు.
అందులో భాగంగా విజయనగరం జిల్లాలో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలు జరుగుతాయని అందులో తొలి రోజు ఉదయం 8:30గంటలకు క్రికెట్ పోటీలు ముఖ్య అతిధుల సమక్షంలో ప్రారంభవం అవుతుందన్నారు.