కడపజిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఉదయం శివధనుర్భంగా లంకారంలో కోదండ రాముడు దర్శన మిచ్చారు.కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు.
స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు కటాక్షించారు.
అనంతరం ఉదయం 11 గంటలకు ఆలయంలో ఏకాంతంగా తిరుమంజనం వేడుకగా నిర్వహించనున్నారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో మురళీధర్, సూపరింటెండెంట్ వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ధనంజయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు