Slider జాతీయం

రోగ్స్:పెళ్లైన తెల్లవారే వధువుపై సామూహిక అత్యాచారం

bride gang raped in up

ఉత్తరప్రదేశ్ లో పెళ్లైన తెల్లవారే నవవధువుపై దారుణం జరిగింది. కాళ్ళ పారాణి అరక ముందే సామూహిక లైంగికదాడికి గురైంది. హాపూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘోర సంఘటన సంచలనం సృష్టించింది.ఇంటి నిండా బంధువుల కోలాహలం సందడిగా ఉన్న ఆ ఇంట్లో పెళ్లికూతురు ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. కిడ్నాప్ చేసి మరి ఆమెపై దారుణానికి ఒడిగట్టారు గుర్తు తెలియని దుండగులు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 17న వివాహన బాధితురాలు అన్ని కార్యక్రమాలు అయిపోవడంతో అత్తింట్లో అడుగు పెట్టింది. ఆ మరుసటి రోజు నే ఆమె కనిపించకుండా పోవడంతో అత్తింటివారు ఆందోళన చెందారు. గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను సంప్రదించారు

ఈ క్రమంలో ఆదివారం హాపూర్‌లోని ఓ బ్యాంకు సమీపంలో అపస్మారక స్థితిలో ఆమెను గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో బాధితురాలు షాక్ లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

Related posts

రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న ఈటెల

Satyam NEWS

జనసేన లోకి పిల్లి సుభాష్ చంద్రబోస్?

mamatha

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 33వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!