విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఒక రౌడీషీటర్ మధ్య ఘర్షణ హత్య దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కలిపి రౌడీషీటర్ ని హత్య చేసినట్టుగా సమాచారం అందింది.
ఆ ఇద్దరు నిందితులు ఆరిలోవ పోస్ట్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. రౌడీ షీటర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.