విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై యువతి గొంతు ను కత్తితో కోసి ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వరలక్ష్మి అనే విద్యార్థిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి గొంతుకోశాడు. తీవ్ర రక్త స్రావం అయి ఆ అమ్మాయి మృతి చెందింది.
దాడికి పాల్పడ్డ యువకుడి అఖిల్ గా గుర్తించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం వెనక ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని కెజిహెచ్ కు తరలించారు.