బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల దరఖాస్తుకు బుధవారంతో గడువు ముగుస్తోందని అటవీ శాఖ సోమవారం తెలిపింది. ఆలస్య రుసుము రూ. వెయ్యి చెల్లించి ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఇంటర్మీడియట్, ఎంసెట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని పేర్కొంది. పూర్తి వివరాలకు www.fcrits.in వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించింది.
పేమెంట్ కోటా సీట్లు
ఈ సంవత్సరం (2020-21) నుండి పేమెంట్ కోటా సీట్ల ను ప్రవేశ పెట్టారు. దీనికై దరఖాస్తును నేటి నుండి (18th Nov) తీసుకొనబడుతుంది. దరఖాస్తుకై చివరి తేదీ 25 నవంబరు గా నిర్ణయించారు. దరఖాస్తు రుసుం రూ. 3000 లను చెల్లించి. www.fcrits.in. లో అభ్యర్ధులు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు ఇంటర్మీడియట్ తో పాటు ఎంసెట్ లో ర్యాంక్ కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు www.fcrits.in. లేదా helpline number, 08454-236 510ను సంప్రదించగలరు.