27.7 C
Hyderabad
March 29, 2024 04: 49 AM
Slider వరంగల్

బిఎస్పి ములుగు జిల్లా ఇంచార్జి గా శనిగరపు నరేష్ కుమార్

#BSP Mulugu

బహుజన సమాజ్ పార్టీ ములుగు జిల్లా ఇంచార్జి గా శనిగరపు నరేష్ కుమార్ ను రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ నియామకం చేసినట్లు ములుగు జిల్లా కో-ఆర్డినేటర్ మైస సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు.

మంగళవారం నాడు BSP రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో శనిగరపు నరేష్ కుమార్ ని బహుజన్ సమాజ్ పార్టీ లోకి కండువా కప్పి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయనకు జిల్లా ఇంచార్జి బాధ్యతలు అప్పగించినట్లు మైస సతీష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ లు సద్గురు మల్లేశం, దేవుల గంగాధర్  పాల్గొన్నారు. జిల్లా ఇంచార్జి గా నియమితుడైన నరేష్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బహుజన భావజాలాన్ని పెంపొందించేందుకు పని చేస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో BSP రాష్ట్ర పార్టీ తన సేవలను గుర్తించి, పార్టీలోకి ఆహ్వానించి పదవి భాద్యతలు అప్పగించిన్నందుకు పార్టీకి, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ కి, జిల్లా కో-ఆర్డినేటర్ మైస సతీష్ కి, ములుగు జిల్లా కమిటీ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా జిల్లా లో పార్టీ బలోపేతంకు అహర్నిశలు పాటుపడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యాసం సిద్దార్థపులే, జిల్లా ప్రధాన కార్యదర్శి కడపాక రాజశేఖర్ వర్మ, Bsp అసెంబ్లీ అధ్యక్షులు మహేష్ సురేష్, BSP నాయకులు కర్ణాకర్, నగేష్, కుమార్, స్వామి, మహేష్, చంటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బయోఇన్ఫర్మేటిక్స్ మీద అతిధి ఉపన్యాసం

Satyam NEWS

అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన బాబు రాజేంద్ర ప్రసాద్

Satyam NEWS

చైనాలో ప్రమాదకరంగా పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

Leave a Comment