బహుజన సమాజ్ పార్టీ ములుగు జిల్లా ఇంచార్జి గా శనిగరపు నరేష్ కుమార్ ను రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ నియామకం చేసినట్లు ములుగు జిల్లా కో-ఆర్డినేటర్ మైస సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు.
మంగళవారం నాడు BSP రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో శనిగరపు నరేష్ కుమార్ ని బహుజన్ సమాజ్ పార్టీ లోకి కండువా కప్పి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆయనకు జిల్లా ఇంచార్జి బాధ్యతలు అప్పగించినట్లు మైస సతీష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ లు సద్గురు మల్లేశం, దేవుల గంగాధర్ పాల్గొన్నారు. జిల్లా ఇంచార్జి గా నియమితుడైన నరేష్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బహుజన భావజాలాన్ని పెంపొందించేందుకు పని చేస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో BSP రాష్ట్ర పార్టీ తన సేవలను గుర్తించి, పార్టీలోకి ఆహ్వానించి పదవి భాద్యతలు అప్పగించిన్నందుకు పార్టీకి, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ కి, జిల్లా కో-ఆర్డినేటర్ మైస సతీష్ కి, ములుగు జిల్లా కమిటీ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా జిల్లా లో పార్టీ బలోపేతంకు అహర్నిశలు పాటుపడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు యాసం సిద్దార్థపులే, జిల్లా ప్రధాన కార్యదర్శి కడపాక రాజశేఖర్ వర్మ, Bsp అసెంబ్లీ అధ్యక్షులు మహేష్ సురేష్, BSP నాయకులు కర్ణాకర్, నగేష్, కుమార్, స్వామి, మహేష్, చంటి తదితరులు పాల్గొన్నారు.