ములుగు జిల్లా నల్లబెల్లి మండలం బోలోని పల్లి గ్రామంలో బద్ది పోచమ్మ జాతర ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున జాతరలో పాల్గొని బద్ది పోచమ్మ తల్లిని దర్శించుకుని ముక్కులు చెల్లించారు. ములుగు జిల్లా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి గౌడ్ కూడా బద్ది పోచమ్మ తల్లిని దర్శించుకుని ముక్కులు చెల్లించారు. అనంతరం బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ మల్లంపల్లి మండలం ఏర్పాటు కావాలని బద్ది పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. బద్ది పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన వారిలో మల్లంపల్లి మండల సాధన సమితి నాయకుల తోటకూరి శ్రీకాంత్ గౌడ్ తదితర మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.
previous post