విశాఖపట్నంలోని రామజోగి పేట లో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి మూడు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 5 గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. శిథిలాల కింద ఒక చిన్నారి మృతదేహం లభ్యమైంది. మరో కొంతమంది శిథిలాల కింద ఉండడంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్.డి.ఆర్.ఎఫ్.ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. బాధితుల ను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.
previous post