27.7 C
Hyderabad
April 25, 2024 10: 12 AM
Slider ఆంధ్రప్రదేశ్

భవన నిర్మాణ కార్మికులు చనిపోయారా? ఎక్కడ?

ambati 2

50 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారంట. ఎక్కడ చనిపోయారండి. అధర్మంగా వ్యవహరించకండి. లోకేష్ చంద్రబాబులు శవరాజకీయాలు చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారప్రతినిధి, ఎంఎల్ ఏ అంబటి రాంబాబు నిప్పులు చెరగారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి, పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నవ్యక్తి ఇసుక దీక్షలో డ్రామాలు ఆడారు. పలుగు,పారలు కెమెరాలకు కనబడేలా చేయాలని దీక్షలో కూర్చున్నవారికి చంద్రబాబు డైరక్షన్ చేస్తున్నారు. ఇదీ ఆయన చేసిన దీక్ష అని రాంబాబు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ను మించిన మహానటుడు చంద్రబాబు అని ఆయన అన్నారు. ఇసుక కొరతపై చంద్రబాబు చేసింది దొంగ దీక్ష అని ఆయన తెలిపారు. ఆరునెలలు అధికారం లేకపోయేసరికి చంద్రబాబు ప్రస్టేషన్ లో ఉన్నారు.వికృత రూపం ప్రదర్శిస్తున్నారంటూ ఆయన విమర్శించారు. బొచ్చా,పార పట్టుకున్నవారినే కాదు పవన్ కల్యాణ్ తో సైతం బాగా నటింపచేస్తున్నారు చంద్రబాబు అని ఆయన అన్నారు. వెనకబడిన వర్గాల వారంటే జగన్ కి కక్ష అంట కాబట్టి ఇసుక సమస్యను తెచ్చారు అని దారుణంగా మాట్లాడుతున్నారు. ఇది సహించరానిదని రాంబాబు అన్నారు.

Related posts

ఘనంగా కోడి రామ్మూర్తి నాయుడు స్మారక దినోత్సవ వేడుకలు

Satyam NEWS

పాఠశాలలను అందంగా తీర్చిదిద్దేందుకే మన ఊరు మన బడి

Satyam NEWS

శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని రైస్ మిల్లు యాజమాన్యాన్ని కోరిన కార్మికులు

Satyam NEWS

Leave a Comment