36.2 C
Hyderabad
April 23, 2024 20: 28 PM
Slider నల్గొండ

నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

#CITU Hujurabad

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం  సంఘం టౌన్ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ క్లైమ్ ల సమస్య పరిష్కారం కావడం లేదని,కార్మికశాఖ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,వెల్ఫేర్ బోర్డు నిధుల నుండి 55 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సేవ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈనెల 9వ తారీఖున కలెక్టరేట్ ముందు జరిగే ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులను కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,యలక సోమయ్య గౌడ్,ఉపతల గోవిందు,షేక్ ముస్తాఫా, ఉప్పతల వెంకన్న,ఉప్పతల నరేష్,పల్లపు రామకృష్ణ,శీలం వేణు,షేక్ నజీర్,బుద్ధి నరసింహారావు, సైదులు, నాగుల్ మీరా, పగిళ్ల సోమేశ్,అంజి,అశోక్, తదితరులు  పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రెడ్ల ప్రభుత్వం రావాలనుకున్న వాళ్లకు బుద్ధి వచ్చింది

Satyam NEWS

టీడీపీ నాయకురాలు డి.కె.సత్య ప్రభ కన్ను మూత

Satyam NEWS

నిషేధిత గుట్కా అక్రమ రవాణా, విక్రయదారులపై ప్రత్యేక దృష్టి

Satyam NEWS

Leave a Comment