నిర్మల్ జిల్లా కేంద్రంలో ని రూరల్ పోలీసు స్టేషన్ ఎదురుగా గురువారం విజయ డైరీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ లోకా భూమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు, పోలీస్,వైద్య సిబ్బంది కి 6000 ప్యాకెట్ల మజ్జిగను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, SP శశిధర్ రాజు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ ఎంపిపి రామేశ్వర్ రెడ్డి, TRS నాయకులు సత్యనారాయణ గౌడ్, DHMO వసంత రావు, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ దేవేందర్ రెడ్డి, DSP ఉపేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.