39.2 C
Hyderabad
March 29, 2024 13: 30 PM
Slider మహబూబ్ నగర్

సర్కార్ వారి పాట రూ.400 కోట్లు నిజమా? అబద్దమా

#dkmadiga

అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఉన్నారో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డి యువసేన కొల్లాపూర్ నియోజక కాంగ్రెస్ పార్టీ తాలూకా అధ్యక్షులు డీకే మాదిగ డిమాండ్ చేశారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఉండి దర్శకత్వ బాధ్యత వహిస్తూ, బిజెపి పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తుందని, ప్రచారం మొదలుపెట్టారని ఆయన అన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీ నలుగురు ఎమ్మెల్యేల నెత్తిన, చారానా పెడితే రూపాయికి చెల్లరని, వీళ్లకు బిజెపి పార్టీ ఒక్కొక్కరికి 100 కోట్లు నలుగురు కలిపి 400 కోట్లు ఎలా ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

ఎన్టీవీ బృందం వాళ్ళు వెళ్లి అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన గువ్వల బాలరాజుని ప్రశ్నిస్తుంటే, అతను కేవలం ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు….ఇది మా ఫ్రెండ్ ఫామ్ హౌస్ అందుకే వచ్చాం అని చెబుతున్నారని, ఫామ్ హౌస్ లోకి, ఎవరైనా టీ తాగడానికి వెళ్తారా? అని డీకే మాదిగ సూటిగా ప్రశ్నించారు. ఇది కేవలం మునుగోడు నియోజకవర్గ ప్రజలను అయోమయ పరిస్థితులో పడవేయడానికి, ఫార్మ్ హౌస్ లో కూర్చుని కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం వహించి కేసీఆర్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజమౌళిని మించిన డైరెక్టర్ అయ్యి మునుగోడు నియోజకవర్గ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని డీకే మాదిగ అన్నారు. సర్కార్ వారి పాట ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల చొప్పున 400 కోట్లు నిజంగా బిజెపి పార్టీ ఒప్పుకుంటే కచ్చితంగా ఇవ్వాల్సిందే…  పార్టీ ఫిరాయింపుదారులను కొనడం బిజెపి పార్టీకి అలవాటే.. ఇటు టిఆర్ఎస్ పార్టీ కూడా అలవాటే… ఏది ఏమైనా చివరికి న్యాయమే గెలుస్తుంది అని ఆయన అన్నారు.

Related posts

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీ: ఒకరి పరిస్థితి విషమం

Satyam NEWS

అనుకోని ఆపద వచ్చింది… ఆదుకుంటారా!

Bhavani

వాల్మీకులారా… కేసీఆర్ ను నిలదీయండి..

Satyam NEWS

Leave a Comment