32.2 C
Hyderabad
March 29, 2024 00: 20 AM
Slider కడప

విభజన చిచ్చు: ఇక బై..బై…వైసీపీ…

#ysrcongress

చిరకాలంగా కాంగ్రెస్ కు అనంతరం వైసీపీ పి కంచుకోటలా ఉన్న రైల్వే కోడూరు నియోజక వర్గం ఉడుమువారి పల్లె గ్రామం జిల్లా విభజన చిచ్చు రేపింది. రైల్వే కోడూరు నియోజక వర్గం ను రాయచోటి జిల్లా లో కలపడం నిరసిస్తూ వైసీపీ పార్టీని గ్రామ బహిష్కరణ చేశారు.

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజక వర్గం పుల్లంపేట మండలం ఉడుమువారి పల్లె గ్రామ సరిహద్దు లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం సృష్టించింది. జిల్లాల విభజన వంచెనకు వైసీపీ కి బరువెక్కిన హృదయాలలో వైస్సార్సీపీ కి ఇక సెలవు అంటూ గ్రామస్తుల ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గతంలో ఏకతాటిపై కాంగ్రెస్ కి అనంతరం వైసీపీ పట్టుగా ఈ గ్రామ ప్రజలు జిల్లా విభజన చిచ్చు రేపింది.

జిల్లా విభజన లో అన్యాయం జరిగినందున తాము వైసీపీ వెంట నడవలేమని గ్రామస్తులు మీడియాకి వెల్లడించారు. అన్ని వసతులు ఉన్న రాజంపేట ను కాదని రాయ చోటిని ఎలా జిల్లా గా ప్రకటిస్తారని,రైల్వే కోడూరు ఎమ్మెల్యే, రాజంపేట ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని వారు ఎక్కడున్నారని ప్రశ్నించారు. నాయకుల స్వార్థం కోసం ప్రజలని బలి చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

పరిషత్ పోలింగ్ ను పరిశీలిస్తున్నడీఐజీ..!

Satyam NEWS

రాజకీయంగా ఎదిగేందుకు సాయపడుతున్న వారికి థాంక్స్

Satyam NEWS

ఇబ్రహీంపట్నం కు.ని ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment