32.2 C
Hyderabad
April 20, 2024 20: 04 PM
Slider పశ్చిమగోదావరి

24న రాజమండ్రిలో అంబేడ్కర్ ఆలోచన ఫౌండేషన్ క్యాడర్ క్యాంప్

#ambedkar

ఆంధ్ర ప్రదేశ్ అంబేడ్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 24న తూర్పుగోదావరిజిల్లా రాజమండ్రి లో 2 nd జోన్ క్యాడర్ క్యాంప్ జరుగుతుందని ఫౌండేషన్ చైర్మన్, న్యాయవాది పినిపే వెంకట రామకృష్ణ తెలిపారు.

కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, ఈ ఐదు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు, కన్వీనర్లు, మహిళా కన్వీనర్లు, SC, ST, న్యాయవాదులు అలాగే మేధావులు హాజరుకానున్నారని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న  సుమారు 6800 మంది SC,ST, న్యాయవాదులకు జ్యూడిషరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకాక  తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో, సబార్డినేట్ కోర్టుల్లో వందలాది నామినేటెడ్ పోస్టులు నియామకం రాష్ట్ర ప్రభుత్వమే భర్తీ చేస్తోందని, ఈ నియామకాల్లో SC,లకు 15 % ST,లకు 7%  ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

SC,ST లపై దాడులు, అత్యాచారాలు, వీరి భూములు ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడం,  వీరికోసం ఉన్నా చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడంపై  ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమానికి ఏలూరు బార్ అసోసియేషన్  నుండి అధ్యక్షుడు తిరుపతి స్వామి, బోడపాటి బెన్ని మరి కొంత మంది కమిటీ సభ్యులు  హాజరౌతున్నారని అడ్వకేట్ MJ ప్రకాష్ తెలిపారు.

(పినిపే వెంకట రామకృష్ణ సెల్ 9849829185)

Related posts

కరప్టెడ్ : ఏసిబి కి చిక్కిన శేరిలింగంపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌

Satyam NEWS

అన్ని రంగాల్లో ఘన విజయం సాధిస్తున్న మహిళలు

Satyam NEWS

పెండింగు చలానాలు కట్టించేందుకు పోలీసుల‌  ప్రత్యేక డ్రైవ్

Satyam NEWS

Leave a Comment