పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజలకు తన వంతు సాయం అందించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నడుంకట్టారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా, ప్రజలకు సాయం అందించేందుకు కవిత ప్రత్యేక ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ కార్యాలయంలో 040-23599999 / 89856 99999, నిజామాబాద్ కార్యాలయంలో 08462- 250666 ద్వారా కరోనా విషయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కవిత తెలిపారు.
ఈ ఫోన్ ల ద్వారా కరోనా సమాచారాన్ని అందించడం, వారికి సలహాలు సూచనలు ఇస్తారు.
ప్రజల నుండి నిరంతరం ఫోన్ కాల్స్, మెస్సేజ్ లు వస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఫోన్ నంబర్ల ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.