రాష్ట్రంలో రాక్షస, దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ ప్రతి పక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా కాగడాల ప్రదర్శన చేసింది గుంటూరు జిల్లా నరసరావుపేట లో టీడీపీ నేత నారా లోకేష్ నిరసన కార్యక్రమం అడ్డుకొవడాన్ని నిరసిస్తూ కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు బంగ్లా వద్ద టీడీపీ కాగడాల ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి. రాజు , పార్లమెంట్ అధికార ప్రతినిధి కనకల మురళీమోహన్, పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ బొద్దుల నర్సింగరావు ,పార్టీ మహిళా నేత అనురాధ బేగం, జిల్లా మాజీ యువత అధ్యక్షులు కర్రోతు నర్సింగరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గంటా పోలినాయుడు గారు, మాజీ కౌన్సిలర్ కంది మురళీనాయుడు, జిల్లా మాజీ మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె.ఎం బాషా, కొండ్రు శ్రీను, జమ్మూ రాజు గారు , యువత నాయకులు పో ల్నేటి మహేష్, పొగిరి పైడిరాజు, ఏ.ఏ. రాజు తదితరులు పాల్గొన్నారు..
previous post