కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్లైట్ మెమోరియల్ డే సందర్బంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కాగజ్ నగర్ జిల్లా ఆసుపత్రి నుండి బస్టాండ్ వరకు జరిగిన ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా జిల్లా అదనపు వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ పాల్గొని ఎయిడ్స్ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. HIV తో జీవిస్తున్న వ్యక్తులకు మద్దతును తెలియజేసారు. అలాగే HIV వైరస్ ను అంతం చేయడానికి అందరు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐ సి టి సి కౌన్సిలర్ సతీష్,ల్యాబ్ టెక్నీషియన్ రఫీ, చేతన ఎన్జీవో ప్రోగ్రాం మేనేజర్ తోట సతీష్, శ్రీ సాయి మహిళా మండలి ప్రోగ్రాం మేనేజర్ ఈర్ల సునీల్, జీవనధార బ్లడ్ బ్యాంకు టెక్నీషియన్ రాజేష్ మరియు టిఐ సిబ్బంది పాల్గొన్నారు.
previous post