దేశమంతటా పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ నెల 21 నుంచీ వారం రోజుల పాటు ప్రతీ జిల్లాలో జరగనున్నాయి. ఈ క్రమంలో డీజీపీ ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర మంతటా జరుగగా విజయనగరం జిల్లాలో కూడా జరిగాయి.
ఈ క్రమంలో నే సాయంత్రం పూట కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. పోలీసు అమరవీరుల స్మరిస్తూ,ఎస్పీ దీపికా ఆదేశాల మేరకు మృతి చెందిన వారి సేవలను, త్యాగాలను కొనియాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషను పరిధుల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ మేరకు గజపతినగరం, ఎస్.కోట, బొబ్బిలి, సాలూరు, పూసపాటి రేగ ,పార్వతీ పురంలలో ఈ క్యాండిల్ ర్యాలీ జరిగింది.