చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న దాసుకుప్పం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. సత్యవేడు సీఐ బి వి శ్రీనివాసులు తన సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, సిబ్బందితో కలిసి తెల్లవారుజామున కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధార్ కార్డులు, వాహన రికార్డులను పోలీసులు తనిఖీ చేశారు.
అనుమానితుల నుంచి 32 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై లు నాగార్జున్ రెడ్డి, నరేష్, ఏ ఎస్సైలు షణ్ముగం, ప్రసాద్, పొన్నూస్వామి సిబ్బంది పాల్గొన్నారు.