పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. చిత్తూరులోని అమర రాజా కంపెనీలో పని నిమిత్తం ఓ టెక్నీషియన్ తైవాన్ నుండి ఇండియా వచ్చాడు. అతనికి జలుబు, దగ్గు రావడంతో కరోనా వైరస్ సోకిందేమోననే అనుమానం కలిగింది. వెంటనే కంపెనీ ప్రతినిధులు అతడిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అనుకున్నట్లుగానే అతడికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. తిరుపతి రుయాకి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడిని ప్రత్యేక వార్డుకు తరలించారు.
previous post