కరోన వల్ల గత మార్చి నెలలో, మూత పడ్డ పాఠశాలలు- ప్రభుత్వ ఆదేశాలతో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రుల అంగీకారంతో- 9,10 తరగతుల విద్యార్థులు మాత్రమే పాఠశాల కు హాజరవుతున్నారు.
కరోన నిబంధనలు, పాటిస్తూ ఉపాద్యాయులు , విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం డాక్టర్ల బృందం అజ్జకొల్లు హై స్కూలు విద్యార్థుల కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు-అందరూ ఆరోగ్యంతో ఉన్నారని డాక్టర్లు నిర్ధారించారు.
అందరూ, పాటించవలసిన కనీస జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు. అవసరమైనప్పుడు సమాచారం ఇస్తే చికిత్స అందిస్తామని చెప్పారు. బి. కృష్ణ ,ఇంచార్జి ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.
మెడికల్ క్యాంపు నిర్వహించిన వారిలో డాక్టర్ నిసార్ అహ్మద్,డాక్టర్ షoషున్నిసా, ఫార్మసీస్ట్ యాదయ్య, ఏఎన్ఎం చిలుకమ్మ ఉన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు , ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు బి. కృష్ణ, వీరన్న,చంద్రశేఖర్, రాజు,రాజా రెడ్డి,శ్యాం ప్రసాద్,లక్ష్మీ, ఇందుప్రియ పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి