సహజ శత్రుత్వంతో గోప్పలకు పోయే పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చారు ఆదేశ విద్యార్థులు.చైనాలో చిక్కుకుని కరోనా వైరస్ కు భయపడి పాకిస్తాన్ కు తిరిగి వెళ్లాలనుకున్నవిద్యార్థులకు నిరాశే ఎదురయింది. తమ దేశంలో కరోనా వైరస్ ను అరికట్టే వైద్యం లేదని చైనాలో ఉంటేనే మీకు మంచి వైద్యం అందుతుందని అక్కడి పాక్ విద్యార్థులకు చైనాలోని పాక్ రాయబారి తెలపడం పాకిస్తాన్ లో వివాదం సృష్టిస్తుంది.
ఈ మాటలకు ఆగ్రహించిన పాక్ పౌరులు సోషల్ మీడియా ద్వారా ఇలా చేస్తున్నందుకు పాక్ సిగ్గుపడాలి, ఒక్కసారి భారత్ను చూడండి ఆ దేశ పౌరులను ఎలా వెనక్కురప్పిస్తోందో చూడండి చూసి నేర్చుకోండి అంటూ పాక్ కు గడ్డి పెడుతూ అక్కడి విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు భారత్ చేసిన ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు.మొత్తానికి బేషజాలు పక్కన పెట్టి అక్కడి ప్రజలు భారత్ ను మెచ్చుకోవడం హర్షణీయమే