24.7 C
Hyderabad
March 29, 2024 07: 15 AM
Slider కృష్ణ

వాహ‌నాల అడ్డ‌గింత‌.. 9 మందిపై కేసు న‌మోదు

Reports Dup

అర్ధరాత్రి సమయంలో వాహనాలను అడ్డుకుని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నతొమ్మిది మంది విలేకరులపై కృష్ణాజిల్లా నందిగామ ప్రాంతంలోని వీరులపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

జగ్గయ్యపేట 6 టీవీ ఛానల్ కు చెందిన విలేఖరి కొండ్రు సందీప్, 19 యూట్యూబ్ ఛానల్ కు చెందిన శ్రీనివాస్, విట్నెస్ యూట్యూబ్ ఛానల్ కు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తులు గత ఆదివారం రాత్రి సమయంలో వీరులపాడు మండలం జయంతి గ్రామంలో రహదారిపై వెళ్తున్నలారీని ఆపి తమ దగ్గర ఉన్నకత్తిని చూపించి డబ్బులు డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో లారీ వెనుక వస్తున్నకార్మికులు లారీ డ్రైవర్ తో కలసి 6టివి రిపోర్టర్ సందీప్ చితకబాది ముగ్గురు వ్యక్తులను వీరులపాడు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. లారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు లో భాగంగా వీరితో కలిసి గతంలో ఇదే విధమైన అక్రమ వసూళ్లకు పాల్పడిన నందిగామ ఆంధ్రప్రభ విలేకరి సత్యనారాయణ రెడ్డి, కోస్తా ఆంధ్ర విలేకరి తిరుపతిరావు, H6 యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఉప్పు తల వీరబాబు, Zee News యూట్యూబ్ ఛానల్ విలేఖరి కొంగర నవీన్, VSB యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఆవుల గోపికృష్ణతో పాటు చిన్నాఅనే మరో యూట్యూబ్ ఛానల్ విలేఖరిని అదుపులోకి తీసుకున్నారు. తొమ్మిది మందిపై సంబంధిత సెక్షన్లలో కేసు నమోదు చేసినట్లు సమాచారం. కానీ విలేకరులు రహదారిపై ఆపిన లారీ అక్రమంగా రేషన్ బియ్యం తీసుకు వెళుతుందని పోలీస్ స్టేషన్ కు వచ్చిన లారీలో ఎటువంటి లోడు లేదని అక్రమంగా తీసుకువెళ్తున్నబియ్యం పక్కదారి పట్టిందనే వదంతులు వినిపిస్తున్నాయి.

Related posts

అభిమాని కుమార్తె వివాహానికి హాజరైన బాలయ్య

Satyam NEWS

కాంగ్రెస్ పోరుబాట

Murali Krishna

యాదాద్రి శ్రీ‌ ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి ని ద‌ర్శించుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి

Satyam NEWS

Leave a Comment