32వ రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపో ఆవరణలో ఉత్తమ డ్రైవర్లకు పురస్కారాలను అందచేశారు.
ఇప్పటి వరకూ ప్రమాదాలు చేయని డ్రైవర్లను ఎంపిక చేసి పురస్కారం అందచేసినట్లు నరసరావుపేట ఆర్టీసీ డిపో మేనేజర్ యస్ కె అబ్దుల్ సలామ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట డిప్యూటీ సి టి యమ్ వై రాజశేఖర్ ఉత్తమ డ్రైవర్లకు క్యాష్ అవార్డులు అందచేశారు.
అవార్డు గ్రహీతలు: 1 P.ప్రసాదు E392292, 2 S.P.రెడ్డి E392682, 3 K.K రెడ్డి E392681
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన యస్ కె అబ్దుల్ సలామ్ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ నాయకులకు సూపర్వైజర్లకు డ్రైవర్లు కు, గ్యారేజీ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.