మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ లో ఎమ్మెల్సీ ఓట్లకు డబ్బులు పంచున్న ఓ వ్యక్తిని యుటీఎఫ్ నాయకులు పట్టుకున్నారు.
కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి స్వతంత్ర అభ్యర్థి చందు రామారావు తరపున ఉపాధ్యాయులకు డబ్బులు పంచుతున్నాడు ఓ ప్రైవేట్ టీచర్.
యుటీఎఫ్ నాయకుల సమాచారంతో డబ్బులు పంచుతున్న బొమ్మసాని వీరాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని నుండి రూ.లక్షా 500 నగదు స్వాధీనం చేసుకున్నారు. బొమ్మసాని వీరాంజనేయులు తెనాలికి చెందిన ప్రైవేట్ విద్యా సంస్థ టీచర్ గా పోలీసులు గుర్తించారు.
బందరు డీఎస్పీ రమేష్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.