ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభం కూలి కింద పడడంతో ఎద్దు మృతి వివరాల్లోకి వెళితే మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని ఎలికట్ట గ్రామ చాకలికుంటలో భారీ వర్షానికి గాలులు వీచి విద్యుత్ స్తంభం కూలి కిందపడడంతో గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు కత్తి పెద్ద మల్లయ్య కు సంబంధించిన ఎద్దు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడింది.
60వేల రూపాయలు పెట్టి కొన్న ఎద్దు ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై మృతిచెందడంతో తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ రైతు పెద్ద మల్లయ్య, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఆయనకు ధైర్యం చెప్పి ఓదార్చారు గ్రామ సర్పంచ్ జాజల రమాదేవి,మాజీ సర్పంచ్ రాకేష్ శర్మ తదితరులు.