ఐఆర్సీటీసీ కేసులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మంగళవారం ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. IRCTC స్కామ్ కేసులో బెయిల్పై ఉన్న తేజస్వి బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ దరఖాస్తు చేసింది. బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ తేజస్వి యాదవ్ బెయిల్ను రద్దు చేయాలని సిబిఐ డిమాండ్ చేసింది. గత నెల తేజస్వీ యాదవ్ సీబీఐ అధికారులను బెదిరించిన ప్రకటన తర్వాత, సీబీఐ ఈ దరఖాస్తు దాఖలు చేసింది.
ఆ తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి తేజస్వికి నోటీసు జారీ చేశారు. మంగళవారం కోర్టులో విచారణ సందర్భంగా, సీబీఐ దరఖాస్తుపై తేజస్వి యాదవ్ తన సమాధానాన్ని దాఖలు చేశారు. అయితే తేజస్వి యాదవ్ సమాధానాన్ని సీబీఐ వ్యతిరేకించింది. సీబీఐ దర్యాప్తు అధికారులనే బెదిరిస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును ప్రశ్నించారు.
ఈ ఏడాది ఆగస్టులో ఉత్తరప్రదేశ్లో విచారణ అధికారిపై హత్యాయత్నం జరిగింది. ఆయన కారును రెండుసార్లు ట్రక్కు ఢీకొట్టింది. తమకు ఎటువంటి ఆధారాలు లేవు, లింక్ లేదు కానీ ఈ సంఘటన తర్వాత సీబీఐ అధికారులలో భయం, ఆందోళన వాతావరణం ఉంది అని సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు. తేజస్వి యాదవ్ ప్రసంగంలోని భాగాలు కోర్టులో చదవి వినిపించారు. దర్యాప్తును ప్రభావితం చేయడానికి ఇది ఒక మార్గం అని సిబిఐ తరపు న్యాయవాదులు తేల్చారు.
తేజస్విని అరెస్టు చేసేందుకు తాము ఎప్పుడూ ప్రయత్నించలేదని సీబీఐ తరపున కోర్టులో పేర్కొన్నారు. కానీ దర్యాప్తు సంస్థను బెదిరించే స్థాయికి వస్తే బెయిల్ను రద్దు చేయాలి అని వారు తెలిపారు. రద్దు అయితే తేజస్వికి కష్టాలు పెరిగే అవకాశం ఉంది. నిజానికి, IRCTC స్కామ్ కేసులో లాలూ, తేజశ్వి సహా చాలా మంది కుటుంబ సభ్యుల పేర్లు చేర్చబడ్డాయి. IRCTC కుంభకోణం కేసులో తేజస్వి ఈరోజు సీబీఐ కోర్టుకు హాజరు కావడానికి తేజస్వి వాంగ్మూలమే ప్రధాన కారణం.
ఆగస్ట్ 25న తేజస్వి మీడియా సమావేశం నిర్వహించి సీబీఐపై పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు. సీబీఐ ఆఫీసర్లకు తల్లులు, పిల్లలు లేరా, కుటుంబాలు లేవా, ఎప్పుడూ సీబీఐ ఆఫీసర్లే కదా, రిటైర్మెంట్ తీసుకోరు, ఈ పార్టీ మాత్రమే అధికారంలో ఉంటుంది, ఏం మెసేజ్ పంపాలనుకుంటున్నారు’’ అని తేజస్వి వ్యాఖ్యానించారు.
మీసాలు కూడా లేని తేజస్వి యాదవ్ ఇప్పుడు కాదు. ఇప్పుడు మాకు ఏడేళ్ల అనుభవం ఉంది. ఇందులో రెండుసార్లు ప్రతిపక్ష నేత, రెండుసార్లు డిప్యూటీ సీఎం అయ్యాను అని ఆయన వ్యాఖ్యానించారు. తన నివాసంలో సీబీఐ కార్యాలయం తెరవాలనుకుంటే.. దానికి స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని కూడా వ్యాఖ్యానించారు. ఇవన్నీ సీబీఐ అధికారులను బెదిరించడమేనని సీబీఐ తన వాదనలో పేర్కొన్నది.