మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ నాలుగవ రోజు కొనసాగుతున్నది. ఇప్పటికే హత్య కేసుకు సంబంధించిన రికార్డులను సీబీఐ స్వాధీనం చేసుకున్నది. ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం పలుమార్లు సిట్ అధికారులతో భేటీ అయి పూర్తి స్ధాయిలో వివరాలను సేకరించింది.
హత్య ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సీబీఐ అధికారులు అధ్యయనం చేశారు. నిన్న మరో మారు వివేకానందరెడ్డి ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించారు. వివేకా హత్యకు గురైన పడక గది, స్నానపు గదుల పరిసర ప్రాతాలను వారు నిశితంగా పరిశీలించారు.
వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతలతో సీబీఐ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. నేటి నుంచి కీలక వ్యక్తులను సీబీఐ అధికారులు విచారణ చేయనున్నారు.